డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. పలువురు దాతలు విరాళాలను అందించారు.
జెద్ధాలోని తెలుగు ప్రవాసీ సంఘమైన ‘సాటా’ శుక్రవారం కార్తీక వనభోజనాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలుగు ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) శోభనాద్రిపురం గ్రామంలో కొత్త బోర్వెల్, వాటర్ లిఫ్టింగ్ పంప్ సౌకర్యాన్ని ఏర్పాటుచేసింది.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ సాహిత్య వేదిక 'నెల నెలా తెలుగువెన్నెల' 220 వ సాహిత్య సదస్సు.. డాలస్ టెక్సాస్లోని సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. ' మహాకవి వాక్పతిరాజు - సాహితీ విహంగ వీక్షణం ' అంశం పై ముఖ్య అతిథి శ్రీ పరిమి శ్రీరామనాథ్ ప్రసంగం సాహితీ ప్రియులను విశేషంగా అలరించింది.
వీరవల్లిలో ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని తానా విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులకు రూ. 20 లక్షల విలువైన పవర్ స్ప్రేయర్లు, పరజాలు, భద్రతా కిట్లు అందజేసింది.
బన్నీ ఉత్సవాల్లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన కర్నూలు వాసి చిన్న ఆంజనేయ కుటుంబాన్ని తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు రవి పొట్లూరి, ఇతర ఎన్నారైలు ఆదుకున్నారు. రూ.1 లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు.
రాజధాని మెట్రో ప్రాంతం వేదికగా, తెలుగు భాష, కళా,సంస్కృతీ వారసత్వ పరంపరను స్వర్ణోత్సవ సంస్థ బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం కొనసాగిస్తోంది. ఈ సంవత్సరం దీపావళి సంబరాలు సుమారు 1500 మంది ప్రవాస భారతీయుల మధ్య కోలాహలంగా నిర్వహించింది.
శ్రీ సాంస్కృతిక కళారాధన సంస్థ ఆధ్వర్యంలో కార్తీకమాస స్వరారాధన వైభవంగా జరిగింది. ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత డా. అద్దంకి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్తీకమాస వైశిష్ట్యం గురించిన వివిధ అంశాలను ఒక చక్కటి ప్రవచనంగా అందించారు.
జెడ్డాలో వనభోజనాలకు సన్నాహాలు చేస్తున్నామని ప్రవాసీ సంఘం సాటా పేర్కొంది. ఇందులో భాగంగా ప్రవాసీయుల కుటుంబాలలోని క్రీడా, సాంస్కృతిక, ఇతర కళలలోని ప్రతిభను గుర్తించి ప్రొత్సహించే విధంగా వివిధ కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించింది.
సాటా సెంట్రల్ ఆధ్వర్యంలో రియాద్లో వైభవంగా కార్తీక వనభోజనాలు జరిగాయి. ఆప్యాయత, ఆధ్యాత్మిక చింతన, సాంస్కృతిక చైతన్యాల మేళవింపుతో మహత్తరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.