Terrorist In Pahalgam: పర్యాటకులే లక్ష్యంగా ముగ్గురు టెర్రరిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. అతి సమీపం నుంచి పర్యాటకుల్ని కాల్చి చంపారు. వారు ముస్లింలా కాదా తెలుసుకుని మరీ కాల్పులకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఉగ్రవాదంపై పోరాటానికి భారత్ కృతనిశ్చయాన్ని ఇలాంటి దుష్టశక్తుల పన్నాగాలు నీరుగార్చలేవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఈ ఘతుకానికి పాల్పడిన వారు తీవ్ర పరిణామాలను చవిచూస్తున్నారని, ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని అమిత్షా చెప్పారు. భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు శ్రీనగర్ వెళ్తున్నట్టు చెప్పారు.