జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కానుండడంతో సోమవారం సాయంత్రమే ఈవీఎం, వీవీప్యాట్లను సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
ఈసారి పోలింగ్ జరుగుతున్న పలు నియోజకవర్గాల్లో కూటమి భాగస్వామ్య పార్టీల నేతలే ప్రత్యర్థులుగా తలపడుతుండటం ఆసక్తిని కలిగిస్తోంది. కొన్ని చోట్ల టిక్కెట్లు నిరాకరించడంతో రెబల్ అభ్యర్థులు సైతం పోటీలో ఉన్నారు.
నవంబర్ 6న తొలి విడత పోలింగ్ జరిగి నాలుగు రోజులైనా గణాంకాలను ఇంతవరకూ ఈసీ బయటకు వెల్లడించలేదని తేజస్వి ఆరోపించారు. గతంలో ఎన్నికల రోజే ఓటింగ్ గణాంకాలను వెల్లడించేవారని, ఇప్పుడు ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనేపథ్యంలో వివిధ పోలింగు స్టేషన్లకు ఎన్నికల సామాగ్రిని అధికారులు పంపిణీ చేశారు.
జన్సురాజ్ నిర్మాణానికి తాము ఎంతో కష్టపడ్డామని, మార్పు ఇప్పటికే కనిపిస్తోందని, ఫలితాల కోసం వేచిచూద్దామని ప్రశాంత్ కిషోర్ అన్నారు. బిహార్ ప్రజలు ఇప్పటికీ మార్పును కోరుకోకుంటే వారితోనే ఉంటూ మరో ఐదేళ్లు పని చేస్తూ వెళ్తానని చెప్పుకొచ్చారు. అంతేకానీ, ప్రభుత్వంలో చేరే ప్రసక్తే లేదన్నారు.
నేటితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగియడంతో.. అధికారులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఓటింగ్ జరుగుతుండటంతో ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి జూబ్లీహిల్స్ ఓటరు పట్టం కట్టాడనేది నవంబర్ 14వ తేదీన వెల్లడి కానుంది.
ఎలక్షన్స్ లేకుంటే సినిమా వాళ్ల మీద కేసులు పెడతారని కేటీఆర్ విమర్శించారు. అదే ఎలక్షన్స్ వచ్చాయంటే సినిమా వాళ్ళ కాళ్ళ మీద పడతారంటూ కాంగ్రెస్ పార్టీ నేతల వైఖరిని ఈ సందర్భంగా కేటీఆర్ ఎండగట్టారు.
బీఆర్ఎస్, బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన కాంగ్రెస్ పార్టీదే విజయమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారు. మాగంటి గోపినాథ్ తల్లి ఆవేదనకు కేటీఆర్ జవాబు చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అలాగే గోపినాథ్ కుమారుడు సంధించిన ప్రశ్నలకు సైతం సమాధానం చెప్పాలని కేటీఆర్కు సూచించారు. నవీన్ యాదవ్పై ఒక్క కేసును బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చూపిస్తే తాను దేనికైనా సిద్ధమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంత అన్న కుమార్తె వివాహం శనివారం (నవంబర్ 8వ తేదీ) హైదరాబాద్లో జరిగిందన్నారు. దీనికి ఆయన భార్యతో కలిసి ఎందుకు వెళ్ల లేదో చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.