జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు.
పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఆధిక్యత కనపరుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లో మొత్తం 101 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అధిక్యతతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు మొదలు పెట్టారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం 202 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్ష మహాగట్బంధన్ 34 స్థానాలకు పతనమైంది. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ కోసం...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరికీ వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై అందరిలో టెన్షన్ నెలకొంది. హోరాహోరీగా సాగిన ఓటింగ్లో విజయం ఎవరిని వరిస్తుందోనని అభ్యర్థులతో పాటు పార్టీల కార్యకర్తలు, ఓటర్లు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ను రేపు నిర్వహించనున్నారు. ఎన్డీయే, మహాగఠ్బంధన్లల్లో విజయం ఎవరిని వరిస్తుందో రేపు తేలిపోతుంది. ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగిన నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ పతాకస్థాయికి చేరుకుంది. ఎన్డీయే కూటమిదే గెలుపని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే అంచనా వేశాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. నవంబర్ 14వ తేదీన ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ తెలిపారు.
ఎగ్జిట్ పోల్స్ బిహార్ బీజేపీ శ్రేణులను సంబరంలో ముంచెత్తుతోంది. పోల్ డే రోజు పెద్ద ఎత్తున లడ్డూలు పంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మెజారిటీ ఎగ్జిట్ ఫోల్స్ బిహార్లో తిరిగి ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. మహాగఠ్బంధన్కు గతంలో వచ్చిన సీట్లు కూడా రావని పేర్కొన్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్లో ఈసీ నిబంధనలు అతిక్రమించారనే కారణంతో బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం ఆయన చేశారని పోలీసులు పేర్కొన్నారు.