• Home » Andhra Pradesh » Elections

Image 2
Image 2

ఎన్నికలు

AP Elections: సీఎస్ జవహర్ నిరూపిస్తే.. కాళ్లు పట్టుకుంటా!

AP Elections: సీఎస్ జవహర్ నిరూపిస్తే.. కాళ్లు పట్టుకుంటా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహార్ రెడ్డి కుమారుడు ఆధ్వర్యంలో జరిగిన భూ కుంభకోణంపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని జనసేన పార్టీ నాయకుడు, జీవీఎంసీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ స్పష్టం చేశారు.

AP elections: వాటిని సాకుగా చూపి పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదు: ముకేశ్ కుమార్ మీనా

AP elections: వాటిని సాకుగా చూపి పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదు: ముకేశ్ కుమార్ మీనా

బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సంతకమున్నా సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. రిటర్నింగ్ అధికారి సంతకానికి, బ్యాలెట్ చెల్లుబాటుకు సంబంధం లేదని సీఈవో స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌పైనా గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సీల్ లేదని వాటిని ఇన్‌వ్యాలిడ్‌గా పరిగణించకూడదని పేర్కొన్నారు. ఓటర్ తమ ఓటును బ్యాలెట్ పేపర్‌లో సక్రమంగా వేశారా? లేదా? అని మాత్రమే చూడాలని ఆదేశించారు.

Mla Pinnelli: పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు..!!

Mla Pinnelli: పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు..!!

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డిపై మరో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై రాళ్ల దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు.

 AP Elections: అక్కాచెల్లెళ్లకు నోటీసులు

AP Elections: అక్కాచెల్లెళ్లకు నోటీసులు

నెలలతరబడి జగనన్న విద్యాదీవెన డబ్బు లు తల్లుల ఖాతాల్లో వేయలేదు. బటన్‌ నొక్కి కొన్ని నెలలు గడిచిపోయినా డబ్బులు ఖాతాల్లోకి చేర్చలేదు.

AP Elections2024: ఆ భూములను సీఎస్ జవహర్ రెడ్డి కొట్టేశారు.. జనసేన నేత సంచలన ఆరోపణలు

AP Elections2024: ఆ భూములను సీఎస్ జవహర్ రెడ్డి కొట్టేశారు.. జనసేన నేత సంచలన ఆరోపణలు

ఉత్తరాంధ్రాలో రెండు వేల కోట్ల అసైన్డ్ భూములను సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) కొట్టేశారని జనసేన (Jana Sena) సీనియర్ నేత పీతల మూర్తి యాదవ్ (Murthy Yadav) ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల హింస మీద విచారణ జరుగుతుంటే ఆయన విశాఖ వచ్చి భూ వ్యవహారాలు చేస్తున్నారని విమర్శించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ ఆసైన్డ్ భూములు ఎక్కువుగా ఉన్నాయన్నారు. భూముల మార్పిడి జీవో 596.. ఆ జీవో ఆధారంగా భూములు కొట్టేశారని ఆరోపించారు.

AP Elections: లండన్ వెళ్లిన జగన్ తిరిగి వస్తారో.. రారో..!!: వర్ల రామయ్య

AP Elections: లండన్ వెళ్లిన జగన్ తిరిగి వస్తారో.. రారో..!!: వర్ల రామయ్య

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని తిరస్కరించారని, జూన్ 4వ తేదీన ఆ విషయం తెలుస్తోందన్నారు.

AP Election 2024: జిల్లాలకు ప్రత్యేక పోలీసులు.. ఏపీ డీజీపీ కీలక ఆదేశాలు

AP Election 2024: జిల్లాలకు ప్రత్యేక పోలీసులు.. ఏపీ డీజీపీ కీలక ఆదేశాలు

ఏపీ సార్వత్రిక ఎన్నికల (AP Election 2024) కౌంటింగ్‌కు, ప్రస్తుత హింసాత్మక సంఘటనలకు నేపథ్యంలో జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులు రానున్నారు. పోలింగ్ రోజు, అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ఉన్నతాధికారులను నియమించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) శనివారం కీలక ఆదేశాలు జారీ చేశారు.

AP Elections 2024: సీఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్‌కి విరుద్ధం: దేవినేని ఉమ

AP Elections 2024: సీఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్‌కి విరుద్ధం: దేవినేని ఉమ

సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) అన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

Vallabhaneni Vamsi: ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉరికించిన టీడీపీ యువత.. మామూలుగా లేదుగా!

Vallabhaneni Vamsi: ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉరికించిన టీడీపీ యువత.. మామూలుగా లేదుగా!

గన్నవరం మే 25: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రోజు, మరుసటి రోజు వైసీపీ చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మాచర్ల, తిరుపతి, తాడిపత్రి ఘటనలు వీడియోలతో సహా బయటకు రాగా తాజాగా గన్నవరం వైసీపీ అభ్యర్థి వంశీ దాడులకు సంబంధించిన ఘటన ఆలస్యంగా బయటపడింది. కేసరపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పొట్లూరి బసవరావు ఇంటిపై వంశీ దాడి చేయగా.. స్థానిక యువత, గ్రామస్థులు ఆయన్ను పరిగెత్తించిన విషయం వైరల్‌గా మారింది.

AP Elections: బెయిల్ ఇచ్చినా పిన్నెల్లి బయటికి రాలేదేం..?

AP Elections: బెయిల్ ఇచ్చినా పిన్నెల్లి బయటికి రాలేదేం..?

వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. ఈవీఎంల ధ్వంసం కేసులో జూన్6 వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించినప్పటికీ ఎమ్మెల్యే పిన్నెల్లి మాత్రం ఇంకా బయటకురాలేదు. ఓవైపు రామకృష్ణారెడ్డి తప్పించుకుతిరుగుతుంటే.. మరోవైపు ఆయన అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి