ఏరు దాటే దాక ఓడమల్లన్న.. ఏరు దాటిన తరువాత బోడి మల్లన్న.. ఇది మనం తరచుగా వినే సామెత.. చేసిన సహాయాన్ని మరిచిపోయి కృతజ్ఞత చూపని వారిని ఉద్దేశించి ఈ సామెతను వాడుతారు.. ఇది... ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్కు సరిగ్గా అతికినట్లుగా సరిపోతుందంటున్నారు ఏపీ ప్రజలు.. అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి అరెస్టై నేటికి సరిగ్గా పన్నెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో.. ఒక్కసారి గతమంతా ఏపీ ప్రజల కళ్లముందు కదులుతోంది.. ఆ సమయంలో జగన్ కుటుంబం ఆడిన డ్రామా.. ఆస్కార్ నటులను మించి పలికించిన హావభావాలు.. సొంత కుటుంబ సభ్యులను తన రాజకీయ స్వార్థం కోసం వాడుకొని వదిలేసిన విధానం.. తాను జైల్లో ఉన్నన్ని రోజులు తన వారిని, అయిన వారిని రోడ్ల మీద ఉంచి.. ప్రజల్లో పొందిన సానుభూతి.. వాటి ద్వారా అధికారంలోకి వచ్చిన విధానం.. ఇవన్నీ తలచుకొని ఏపీ ప్రజలు ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం ఉంది. గెలిచేదెవరు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎవరి అంచనాలు వారివి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొందరు చెబుతుంటే.. లేదు.. లేదు.. వైసీపీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టబోతుందని మరికొందరు అంటున్నారు.
మాతృ సంస్థలకు పంపేయాలని కోరుతున్న వారి జాబితాలో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి మొదటి వరుసలో ఉన్నారు.
పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ గూండాల అరాచకాలు ఆగడం లేదు. తాజాగా ఓ మహిళపై పాశవికంగా దాడిచేసి గాయపరిచారు. ‘మా అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కాకుండా టీడీపీకి ఓట్లు వేస్తారా.. మీరు వార్డులో ఎలా ఉంటారో చూస్తా.. మిమ్మల్ని అందరినీ చంపేస్తా.. నా పేరే మసి.. నాతో పెట్టుకుంటే మసై పోతారు..’ అని వైసీపీకి చెందిన రౌడీ ఉప్పుతోళ్ల వెంకటేష్ అలియాస్ మసి శనివారం రాత్రి రెచ్చిపోయాడు.
నగరి అసెంబ్లీ సీటులో గెలుపుపై బెట్టింగ్ జోరందుకుంది. కౌంటింగ్కు ఎనిమిది రోజులే గడువు ఉండటంతో పంటర్లు ఎగబడుతున్నారు. రూ.పది వేలు మొదలుకుని రూ.పది లక్షల వరకూ బెట్టింగ్ పెడుతున్నారు. పోలింగ్ తర్వాత విహార యాత్రలకు వెళ్లిన మండల స్థాయి నాయకులు తిరిగి వస్తుండటంతో బెట్టింగ్లకు ఊపు వస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ తర్వాత మాచర్లలో పెద్దఎత్తున అల్లర్లు, అరాచకాలు జరిగిన సంగతి తెలిసిందే. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పాల్పడిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలింగ్ రోజు టీడీపీ పోలింగ్ ఏజెంట్, టీడీపీ నేత నోముల మాణిక్యాల రావుని (Manikya Rao) పిన్నెల్లి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి దారుణంగా హింసించి కొట్టారు.
విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్కు త్వరలో లీగల్ నోటీస్ జారీ చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి (KS Jawahar Reddy) కార్యాలయం హెచ్చరించింది.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ తర్వాత మాచర్లలో పెద్దఎత్తున అల్లర్లు, అరాచకాలు జరిగిన సంగతి తెలిసిందే. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పాల్పడిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలింగ్ రోజు టీడీపీ పోలింగ్ ఏజెంట్, టీడీపీ నేత మాణిక్యరావుని (Manikya Rao) పిన్నెల్లి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి దారుణంగా హింసించి కొట్టారు. ఈ విషయంపై మాణిక్యరావు ఆదివారం ఏబీఎన్తో తన ఆవేదనను పంచుకున్నారు.
గౌతమి శాలి.. ఇప్పుడీ పేరు ఎక్కడ చూసినా వినిపిస్తోంది..! ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) పోలింగ్ తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లాలో, ముఖ్యంగా తాడిపత్రిలో పెద్ద ఎత్తున గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఎస్పీని మార్చేసిన ఎన్నికల కమిషన్.. జిల్లా ఎస్పీగా గౌతమి శాలిని (IPS Gowthami Sali ) నియమించడం జరిగింది. మేడమ్ అనంతలో అడుగుపెట్టగానే సీన్ మొత్తం మారిపోతోంది.!
దొంగలు, దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా జగన్ రెడ్డి గ్యాంగ్ పేదల భూములను దోచుకొని, పంచుకుంటున్నారని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య (Varlaramaiah) అన్నారు.