భోగాపురానికి ధర్మేంద్ర ప్రధాన్, నారా లోకేశ్..

ABN, Publish Date - Jun 30 , 2026 | 10:41 AM

విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులు సహా అనేక వసతులను పరిశీలించారు.

విజయనగరం: భోగాపురంలోని పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్, లోకేశ్‌కు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఘన స్వాగతం పలకగా.. వారిని మంత్రులు ఆప్యాయంగా పలకరించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులు సహా అనేక వసతులను మంత్రులిద్దరూ పరిశీలించారు. ఆ తర్వాత విద్యార్థులతో మాటా-మంతి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

చిత్తూరులో బాలిక అనుమానాస్పద మృతి

తెలంగాణ బీజేపీ ఎంపీల మధ్య తీవ్ర పోటీ.. ఎందుకంటే..

Updated at - Jun 30 , 2026 | 10:46 AM