జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికలు.. ఓటు వేసిన ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ
ABN , Publish Date - Aug 30 , 2026 | 10:28 AM
జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికల్లో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 30: జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ రోడ్ నం.71లోని భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. సినీ ప్రముఖులు, తెలుగు రాష్ట్రాల మంత్రులు, పారిశ్రామికవేత్తలు సొసైటీలో సభ్యులు కావడంతో తమ ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. మొత్తం 15 స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా.. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కోటి, మహిళలకు రెండు, జనరల్కు 12 స్థానాలు కేటాయించారు.
ఇవి కూడా చదవండి
నో బాల్స్ వివాదం.. బౌలర్తో పాటు కోచ్కు కూడా శిక్ష పడాల్సిందే: సునీల్ గావస్కర్
ఆంటారియో సరస్సు పేరు మార్పు.. ట్రంప్ తీరుపై కెనడా నేతల వ్యంగ్యాస్త్రాలు