రాయల్ బాక్స్లో శుభ్మన్ గిల్
ABN , Publish Date - Jul 11 , 2026 | 03:26 AM
టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న గిల్కు...
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న గిల్కు వింబుల్డన్ టెన్నిస్ పోటీలను రాయల్ బాక్సు నుంచి వీక్షించేందుకు ఆహ్వానం అందింది. దీంతో శుక్రవారం జొకోవిచ్-సినర్ మధ్య మ్యాచ్కు హాజరైన గిల్..సచిన్ టెండూల్కర్తో కలిసి మ్యాచ్ను తిలకించాడు. భారత క్రికెటర్లలో ఇప్పటివరకు సచిన్, కోహ్లీ, రోహిత్ శర్మకు మాత్రమే ఈ తరహా ఆహ్వానం లభించింది.
ఇవి కూడా చదవండి:
లార్డ్స్లో తొలి టెస్టు: స్మృతి మంధాన అరుదైన ఘనత
భారత్తో ఏకైక టెస్టు: టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు