Share News

సింధు తొమ్మిదో‘సారీ’

ABN , Publish Date - May 30 , 2026 | 01:52 AM

ప్రపంచ నెంబర్‌వన్‌ షట్లర్‌ అన్‌ సే యంగ్‌ (దక్షిణకొరియా) చేతిలో పీవీ సింధుకు మళ్లీ నిరాశే ఎదురైంది. యంగ్‌తో తలపడిన తొమ్మిదిసార్లూ సింధు ఓటమిపాలైంది...

సింధు తొమ్మిదో‘సారీ’

‘సింగపూర్‌’లో సెమీ్‌సకు సాత్విక్‌ జోడీ

  • అన్‌ సే యంగ్‌ చేతిలో ఓటమి

  • లక్ష్యసేన్‌ కూడా అవుట్‌

సింగపూర్‌: ప్రపంచ నెంబర్‌వన్‌ షట్లర్‌ అన్‌ సే యంగ్‌ (దక్షిణకొరియా) చేతిలో పీవీ సింధుకు మళ్లీ నిరాశే ఎదురైంది. యంగ్‌తో తలపడిన తొమ్మిదిసార్లూ సింధు ఓటమిపాలైంది. సింగపూర్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో అన్‌ సే యంగ్‌ 21-17, 21-14తో సింధును చిత్తుచేసింది. ఇక, క్వార్టర్స్‌లో లక్ష్యసేన్‌ 19-21, 21-15, 15-21తో కొకి వటనబె (జపాన్‌) చేతిలో ఓడాడు. కాగా పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయురాజ్‌/చిరాగ్‌ శెట్టి జోడీ 19-21, 21-17, 21-13తో కాంగ్‌/ఆరోన్‌ (మలేసియా)పై నెగ్గి సెమీస్‌కు దూసుకెళ్లింది. మిక్స్‌డ్‌ క్వార్టర్స్‌లో ప్రత్యర్థి వైదొలగడంతో ధ్రువ్‌ కపిల/తనీషా జోడీ సెమీ్‌సకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి:

కేన్‌ విలియమన్స్‌ వరల్డ్ రికార్డ్

వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్

Updated Date - May 30 , 2026 | 01:52 AM