Share News

భారత్‌ నుంచి తటస్థ వేదికకు మార్చండి!

ABN , Publish Date - Sep 17 , 2026 | 05:32 AM

భారత్‌లో పర్యటించేందుకు పాకిస్థాన్‌ హాకీ జట్టు నిరాకరిస్తోంది. అక్టోబరు 27 నుంచి పంజాబ్‌లో జరిగే...

భారత్‌ నుంచి తటస్థ వేదికకు మార్చండి!

పాక్‌ హాకీ విజ్ఞప్తి ఫ తిరస్కరించిన ఏహెచ్‌ఎఫ్

లాహోర్‌: భారత్‌లో పర్యటించేందుకు పాకిస్థాన్‌ హాకీ జట్టు నిరాకరిస్తోంది. అక్టోబరు 27 నుంచి పంజాబ్‌లో జరిగే ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌ పాల్గొనాల్సి ఉంది. అయితే, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాము భారత్‌లో ఆడలేమని ఆసియా హాకీ సమాఖ్య (ఏహెచ్‌ఎఫ్)కు పాక్‌ తెలిపింది. తమ మ్యాచ్‌లను తటస్థ వేదికకు తరలించాలని కోరింది. అయితే, పాక్‌ విజ్ఞప్తిని తిరస్కరించినట్టు ఏహెచ్‌ఎఫ్ ప్రకటించింది.

Also Read:

భారత సినీ రంగానికి అనంత్ నాగ్‌ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్

రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 17 , 2026 | 05:32 AM