పారా అథ్లెటిక్స్లో సంజయ్కు పతకం
ABN , Publish Date - Mar 22 , 2026 | 06:01 AM
జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షి్పలో తెలుగు ఆటగాడు నీలం సంజయ్ రెడ్డి పతకంతో మెరిశాడు. శనివారం ముగిసిన ఈ పోటీల్లో...
భువనేశ్వర్: జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షి్పలో తెలుగు ఆటగాడు నీలం సంజయ్ రెడ్డి పతకంతో మెరిశాడు. శనివారం ముగిసిన ఈ పోటీల్లో డిస్కస్ త్రో ఎఫ్11 ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన సంజయ్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు. సంజయ్ డిస్క్ను 31.34 మీటర్లు త్రో చేశాడు. హరియాణా అథ్లెట్ మోను ఘంగాస్ (35.05 మీ.) స్వర్ణం, రాజస్థాన్ ఆటగాడు ప్రవీణ్ శర్మ (33.69 మీ.) రజతం నెగ్గారు.
ఇవి కూడా చదవండి:
అతడి స్థాయిని ఎవరూ భర్తీ చేయలేరు: కె. శ్రీకాంత్
రామ జన్మభూమిని దర్శించిన ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్, కెప్టెన్ పంత్..