Share News

మెస్సీ టీమ్‌ మోసం చేసింది!

ABN , Publish Date - Apr 03 , 2026 | 01:11 AM

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ ఆటగాడు లియోనెల్‌ మెస్సీ బృందం తమను మోసం చేసిందని కేరళ క్రీడామంత్రి అబ్దురహిమన్‌ తీవ్ర ఆరోపణలు...

మెస్సీ టీమ్‌ మోసం చేసింది!

కేరళ మంత్రి ఆరోపణ

న్యూఢిల్లీ: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ ఆటగాడు లియోనెల్‌ మెస్సీ బృందం తమను మోసం చేసిందని కేరళ క్రీడామంత్రి అబ్దురహిమన్‌ తీవ్ర ఆరోపణలు చేశాడు. కేరళలో పర్యటించి మ్యాచ్‌ ఆడేందుకు మెస్సీ, అర్జెంటీనా టీమ్‌కు స్పాన్సరర్‌ల ద్వారా రూ. 250 కోట్లు ఇచ్చినట్టు చెప్పాడు. అయితే, డబ్బులు తీసుకొన్న తర్వాత హామీని నిలబెట్టుకోలేదన్నాడు. మరో ఐదు దేశాలను కూడా ఇలాగే మోసగించిన విషయం తమ విచారణలో తెలిసిందన్నాడు. ‘డబ్బు తీసుకొంటారు.. కానీ, ఆడటానికి రారు. అర్జెంటీనా జట్టుపై కేసు వేయాల్సిన పరిస్థితి. వారు తప్పకుండా నష్టపరిహారం చెల్లించాల’ని అబ్దురహిమన్‌ డిమాండ్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: అరుదైన మైలురాయిని తాకిన అజింక్య రహానే

ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Apr 03 , 2026 | 01:11 AM