జ్యోతికి కాంస్యం
ABN , Publish Date - Aug 23 , 2026 | 05:40 AM
వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ సిల్వర్ లెవెల్ మీట్లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ పతకం సాధించింది..
వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్
భువనేశ్వర్: వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ సిల్వర్ లెవెల్ మీట్లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ పతకం సాధించింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో జ్యోతి 13.24 సెకన్ల టైమింగ్తో మూడోస్థానంలో నిలిచి కాంస్యం అందుకుంది. చరిష్మా టేలర్ (బహమాస్ -12.96 సెకన్లు) స్వర్ణం, యుమి తనాక (జపాన్-13.04 సె.) రజతం నెగ్గారు. జావెలిన్ త్రోలో భారత స్టార్ రోహిత్, లాంగ్జం్పలో మురళీ శ్రీశంకర్ టైటిళ్లు గెలిచారు.
ఇవి కూడా చదవండి
ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ
డీఎస్సీపై జగన్కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్