Indonesia Masters Badmintor: ‘ఇండోనేసియా’ బరిలో సింధు, శ్రీకాంత్
ABN , Publish Date - Jan 20 , 2026 | 05:14 AM
ఇండియా ఓపెన్లో నిరాశ పర్చిన భారత షట్లర్లు ఆ తప్పిదాలను సరిదిద్దుకుని ఇండోనేసియా మాస్టర్స్లో పతకాలు...
జకార్త: ఇండియా ఓపెన్లో నిరాశ పర్చిన భారత షట్లర్లు ఆ తప్పిదాలను సరిదిద్దుకుని ఇండోనేసియా మాస్టర్స్లో పతకాలు సాధించేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి జరగనున్న ఈ పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తెలుగు షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, మన్నేపల్లి తరుణ్తో పాటు భారత అగ్రశ్రేణి క్రీడాకారులు లక్ష్యసేన్, హెచ్ఎ్స ప్రణయ్, యువ షట్లరు తన్వీ శర్మ, ఉన్నతి హూడా, మాళవిక బన్సోద్ బరిలోకి దిగుతున్నారు. మనామి సూయిజు (జపాన్)తో సింధు, కోకి వతనాబే (జపాన్)తో శ్రీకాంత్ తొలి రౌండ్లో తలపడనున్నారు.
ఇవి కూడా చదవండి:
రో-కో మళ్లీ బరిలోకి దిగేదెప్పుడంటే.?
అన్నిసార్లూ భారీ స్కోర్లు చేయడం సాధ్యపడదు.. రోహిత్ ఫామ్పై గిల్ స్పందనిదే..