Share News

రికర్వ్‌ అమ్మాయిల సంచలనం

ABN , Publish Date - May 08 , 2026 | 02:23 AM

పదిసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌ కొరియాపై సంచలన విజయం సాధించిన భారత మహిళల రికర్వ్‌ జట్టు..పసిడి పోరుకు దూసుకెళ్లింది..

రికర్వ్‌ అమ్మాయిల సంచలనం

  • వరల్డ్‌కప్‌లో ఒలింపిక్‌ చాంప్‌ కొరియాకు షాక్‌

ఫైనల్లో భారత్‌

షాంఘై: పదిసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌ కొరియాపై సంచలన విజయం సాధించిన భారత మహిళల రికర్వ్‌ జట్టు..పసిడి పోరుకు దూసుకెళ్లింది. ఆర్చరీ వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-2లో గురువారం జరిగిన సెమీ్‌సలో అంకిత భకత్‌, కుంకుం అనిల్‌ మొహోద్‌, దీపికా కుమారితో కూడిన భారత్‌ 5-1తో కొరియాకు షాకిచ్చింది. ఆదివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్‌ చైనాతో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా, ధీరజ్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌, యశ్‌దీ్‌ప భోజ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు రెండో రౌండ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో 2-6తో చిత్తయింది. కాగా, రికర్వ్‌ మిక్స్‌డ్‌ విభాగం రెండో రౌండ్‌లో ధీరజ్‌-అంకిత జోడీ 4-5తో బ్రెజిల్‌ జంట చేతిలో ఓడింది. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ క్వార్టర్స్‌లో అదితి స్వామి-ప్రవీణ్‌ డియోతలే జంట 156-157తో అమెరికా ద్వయం చేతిలో పరాజయం పాలైంది.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా కీలక పదవికి రాజీనామా

Updated Date - May 08 , 2026 | 02:23 AM