Share News

13 ఏళ్లలో తొలిసారి..

ABN , Publish Date - Apr 18 , 2026 | 02:39 AM

ఆసియా జూడో చాంపియన్‌షి్‌పలో భారత క్రీడాకారిణి తఖెల్లామ్‌బామ్‌ ఇనున్‌గాన్బీ కాంస్య పతకంతో సత్తా చాటింది. చైనాలోని ఓర్డోస్‌ సిటీలో...

13 ఏళ్లలో తొలిసారి..

ఆసియా జూడోలో భారత్‌కు పతకం

న్యూఢిల్లీ: ఆసియా జూడో చాంపియన్‌షి్‌పలో భారత క్రీడాకారిణి తఖెల్లామ్‌బామ్‌ ఇనున్‌గాన్బీ కాంస్య పతకంతో సత్తా చాటింది. చైనాలోని ఓర్డోస్‌ సిటీలో శుక్రవారం జరిగిన 70 కిలోల విభాగం కాంస్యం పోరులో ఖావదులామ్‌ సరన్‌సెత్సెగ్‌ (మంగోలియా)ను ఇనున్‌గాన్బీ ఓడించింది. దీంతో ఈ కాంటినెంటల్‌ మీట్‌లో భారత్‌కు 13 ఏళ్ల తర్వాత తొలి పతకం దక్కింది. ఈ టోర్నీలో చివరిగా 2013లో భారత అమ్మాయి అనితా చాను (52 కిలోలు) కాంస్యం నెగ్గింది.

ఇవి కూడా చదవండి:

డగౌట్‌లో ఫోన్ వాడకం.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు జరిమానా విధించిన బీసీసీఐ

గుజరాత్‌పై వరుణ్ చక్రవర్తి విజృంభణ చూస్తాం: కార్తిక్ త్యాగి

Updated Date - Apr 18 , 2026 | 02:39 AM