జూన్ 19న దోహా డైమండ్ లీగ్
ABN , Publish Date - Apr 09 , 2026 | 03:28 AM
భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా సహా అత్యుత్తమ అథ్లెట్లు పోటీపడే ఈ సీజన్ ఆరంభ డైమండ్ లీగ్ పోటీల షెడ్యూల్ మారింది...
దోహా: భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా సహా అత్యుత్తమ అథ్లెట్లు పోటీపడే ఈ సీజన్ ఆరంభ డైమండ్ లీగ్ పోటీల షెడ్యూల్ మారింది. షెడ్యూల్ ప్రకారం తొలుత ఈ లీగ్ దోహా వేదికగా మే 8న జరగాలి. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా దోహా డైమండ్ లీగ్ను జూన్ 19వ తేదీకి రీషెడ్యూల్ చేసినట్టు నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. నీరజ్ గతేడాది ఇక్కడే 90 మీటర్ల మార్క్ను అధిగమించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య