Share News

ఉర్రూతలూగించిన ముగింపు

ABN , Publish Date - Mar 09 , 2026 | 02:16 AM

టీ20 వరల్డ్‌కప్‌ ముగింపోత్సవం అంబరాన్ని తాకింది. మ్యాచ్‌ ఆరంభానికి ముందు భారత సింగర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌, ఫల్గుణి పాఠక్‌తోపాటు...

ఉర్రూతలూగించిన ముగింపు

టీ20 వరల్డ్‌కప్‌ ముగింపోత్సవం అంబరాన్ని తాకింది. మ్యాచ్‌ ఆరంభానికి ముందు భారత సింగర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌, ఫల్గుణి పాఠక్‌తోపాటు గ్లోబల్‌ పాప్‌ స్టార్‌ రికీ మార్టిన్‌ తన ఆటపాటలతో స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. తొలుత ఫల్గుణి గుజరాతీ జానపదాలతో అలరించగా.. ఆ తర్వాత సుఖ్‌బీర్‌ పంజాబీ భాంగ్రాతో హోరెత్తించాడు. అనంతరం అంతర్జాతీయ పాప్‌స్టార్‌ రికీ మార్టిన్‌ తన లాటిన్‌ హిట్‌ ఆల్బమ్‌లు ‘మారియా’, లా కోపా డి లా విడా’లతో స్టేడియం మొత్తాన్ని ఊపేశాడు.

ఇవి కూడా చదవండి:

254 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. కివీస్ బౌలర్ అరుదైన రికార్డ్

అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..

Updated Date - Mar 09 , 2026 | 02:16 AM