జింబాబ్వే పర్యటనకు భారత్
ABN , Publish Date - Apr 02 , 2026 | 03:00 AM
మూడు టీ20ల సిరీస్ కోసం జింబాబ్వేలో భారత జట్టు పర్యటించనుందని బీసీసీఐ బుధవారం విడుదల చేసిన...
జూలైలో మూడు టీ20ల సిరీస్
ముంబై: మూడు టీ20ల సిరీస్ కోసం జింబాబ్వేలో భారత జట్టు పర్యటించనుందని బీసీసీఐ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది జూలై 23, 25, 26 తేదీల్లో హరారేలో మ్యాచ్లు షెడ్యూల్ చేసినట్టు పేర్కొంది. అన్ని మ్యాచ్లు హరారే వేదికగా జరుగుతాయి. కాగా, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగనుండడం 2024 తర్వాత ఇదే తొలిసారి. 2024లో పర్యటించినప్పుడు ఐదు టీ20ల సిరీ్సను భారత్ 4-1తో సొంతం చేసుకొంది.
ఇవి కూడా చదవండి...
అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత
మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్
Read Latest AP News And Telugu News