గౌరవ్ అజేయ శతకం
ABN , Publish Date - Jul 04 , 2026 | 01:45 AM
టీజీ20లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో అనురాగ్ నల్లగొండ నైట్స్ 8 వికెట్లతో మెదక్ ఫాల్కన్స్పై గెలిచింది....
టీజీ20లో మెదక్పై నల్లగొండ గెలుపు
హైదరాబాద్: టీజీ20లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో అనురాగ్ నల్లగొండ నైట్స్ 8 వికెట్లతో మెదక్ ఫాల్కన్స్పై గెలిచింది. మొదట మెదక్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఛేదనలో గౌరవ్ రెడ్డి (47 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 101 నాటౌట్) శతకంతో విజృంభించడంతో నల్లగొండ 16.3 ఓవర్లలో 181/2 స్కోరు చేసి అలవోకగా నెగ్గింది. ఇక, వరంగల్ వారియర్స్, పాలమూరు స్ట్రయికర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
ఈ వార్తలనూ చదవండి:
వీధులు శుభ్రం చేసినట్టు ఏఐ చిత్రాలు.. మున్సిపల్ సిబ్బందిపై వేటు
సింధు జలాలపై భారత్ కఠిన వైఖరి.. ఉగ్రవాదం ఆగేదాకా..