ఆసీస్ జట్టులో ‘భారత’ ఆటగాడు!
ABN , Publish Date - Jun 12 , 2026 | 04:58 AM
భారత్లో జన్మించిన ఓ ఆటగాడికి ఆరు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా జట్టుకు ఆడే అవకాశం దక్కింది....
నిఖిల్ చౌదరి అరుదైన ఘనత
బంగ్లాతో టీ20 సిరీ్సకు ఎంపిక
సిడ్నీ: భారత్లో జన్మించిన ఓ ఆటగాడికి ఆరు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా జట్టుకు ఆడే అవకాశం దక్కింది. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఈ నెల 17 నుంచి జరిగే మూడు టీ20ల సిరీ్సకు ఢిల్లీకి చెందిన స్పిన్ ఆల్రౌండర్ నిఖిల్ చౌదరి (30) ఆసీస్ జట్టుకు ఎంపికయ్యాడు. 2020లో క్వీన్స్లాండ్లోని తన బంధువుల ఇంటికి వెళ్లిన నిఖిల్.. కరోనా కారణంగా అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది. నిఖిల్ ఆస్ట్రేలియా పౌరుడు కాకపోయినా పర్మినెంట్ రెసిడెంట్ పొందడంతో ఆసీ్సకు ప్రాతినిథ్యం వహించేందుకు అర్హుడయ్యాడు.
ఇవి కూడా చదవండి..
పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..
మాతో ఉంటారా.. అభిషేక్తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..