ఆయుష్ అదిరెన్
ABN , Publish Date - Apr 09 , 2026 | 03:46 AM
భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షి్పలో అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ షి ఫెంగ్ (చైనా)కు షాకిచ్చి...
ఏడో ర్యాంకర్కు షాకిచ్చిన భారత షట్లర్
సింధు, ప్రణయ్ ముందంజ
శ్రీకాంత్, లక్ష్యసేన్ అవుట్
నింగ్బో (చైనా): భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షి్పలో అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ షి ఫెంగ్ (చైనా)కు షాకిచ్చి రెండోరౌండ్కు దూసుకెళ్లాడు. బుధవారం ఇక్కడ జరిగిన తొలిరౌండ్ పోరులో ప్రపంచ 25వ ర్యాంకరైన ఆయుష్ 21-13, 21-16తో లిన్ను చిత్తుగా ఓడించాడు. సీనియర్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ 24-22, 21-12తో గుయెన్ హై డాంగ్ (వియత్నాం)పై గెలవగా.. కిడాంబి శ్రీకాంత్ 21-18, 9-21, 11-21తో లో కీన్ యే (సింగపూర్) చేతిలో, లక్ష్యసేన్ 12-21, 19-21తో లీ చుక్ యు (హాంకాంగ్) చేతిలో ఓడి ఆరంభ రౌండ్లోనే ఇంటిబాట పట్టారు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు 15-21, 21-11, 21-19తో వోంగ్ లింగ్ చింగ్ (మలేసియా)పై, ఉన్నతి హుడా 23-25, 21-8, 21-18తో సుపనిద (థాయ్లాండ్)పై నెగ్గి రెండోరౌండ్ చేరగా.. మాళవిక, తన్వీ శర్మ ప్రత్యర్థుల చేతిలో ఓడి వెనుదిరిగారు. మహిళల డబుల్స్లో శ్రుతి మిశ్రా/ప్రియ జోడీ తొలిరౌండ్ దాటింది.
ఇవి కూడా చదవండి:
ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య