Share News

బస్సు మలుపు తిరుగుతుండగా తెరుచుకున్న తలుపు.. కిందపడిన స్టూడెంట్స్

ABN , Publish Date - Mar 31 , 2026 | 04:55 PM

కదులుతున్న బస్సులోంచి ఇద్దరు పదవ తరగతి విద్యార్థులు కింద పడిపోయిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

బస్సు మలుపు తిరుగుతుండగా తెరుచుకున్న తలుపు.. కిందపడిన స్టూడెంట్స్
Students fall from bus in Karnataka

ఇంటర్నెట్ డెస్క్: పదవ తరగతి పరీక్షలు రాసేందుకు వెళుతూ ఆర్టీసీ బస్సులోంచి ఇద్దరు విద్యార్థినులు కిందపడ్డ ఘటన కర్ణాటకలో తాజాగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. విద్యార్థినులు ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. మంగళూరులోని బెల్తంగడి తాలూకా కాలియా గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది.

ఘటన సమయంలో బస్సులో సుమారు 86 మంది ప్రయాణికులు ఉన్నట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ మెట్ల వద్ద నిలబడ్డారు. ఈ క్రమంలో బస్సు మలుపు తిరుగుతుండగా అకస్మాత్తుగా మెట్ల వద్ద ఉన్న డోర్ తెరుచుకోవడంతో విద్యార్థినులు జారి కిందపడిపోయారు.


అక్కాచెల్లెళ్లు ఒకరి తరువాత మరొకరు పడిపోయినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. ఇద్దరికీ గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేఎస్‌ఆర్‌టీసీ దర్యాప్తు ప్రారంభించింది.


ఈ వార్తలూ చదవండి:

రిస్క్ తీసుకున్న ఫలితం.. రూ.20 లక్షలతో 3 కోట్ల సంపద సొంతం

వామ్మో.. విమానాల్లో కూడా జనాలు ఇంతేనా! ఫొటోలు వైరల్

Updated Date - Mar 31 , 2026 | 05:38 PM