జనగామలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్..
ABN, Publish Date - Feb 16 , 2026 | 06:24 PM
జనగామ మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకుని.. ఎన్నికల కేంద్రం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
1/5
జనగామ మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
2/5
ఈ క్రమంలో పరస్పర వాగ్వాదాలు చోటుచేసుకుని ఉద్రిక్తత పెరిగింది.
3/5
పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. కార్యకర్తలను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు.
4/5
చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో రాజకీయంగా ఉద్రిక్తత నెలకొనడంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.
5/5
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను కూడా మోహరించారు.
Updated at - Feb 16 , 2026 | 09:32 PM