మాతృభాష మన మూలాలకు సంకేతం: సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Jan 05 , 2026 | 09:43 PM
గుంటూరులో నిర్వహిస్తోన్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వేదికపై ఏర్పాటు చేసిన తెలుగు తల్లి విగ్రహానికి సీఎం చంద్రబాబు పూలమాల వేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ప్రపంచ తెలుగు మహాసభ వేదికపై తపాలా శాఖ కవర్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.
1/6
గుంటూరులో నిర్వహిస్తోన్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.
2/6
వేదికపై ఏర్పాటు చేసిన తెలుగు తల్లి విగ్రహానికి సీఎం చంద్రబాబు పూలమాల వేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.
3/6
ప్రపంచ తెలుగు మహాసభ వేదికపై తపాలా శాఖ కవర్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.
4/6
అనంతరం తెలుగు మహాసభలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. మాతృభాష మన మూలాలకు సంకేతమని ఆయన అన్నారు
5/6
ఆంగ్లం అవసరమే కానీ.. మాతృభాషను మరిచిపోతే మనల్ని మనమే కోల్పోయినట్లు అవుతుందని చెప్పారు.
6/6
ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated at - Jan 06 , 2026 | 05:49 PM