బాలసుబ్రహ్మణ్యానికి తెలుగు భాష, సంస్కృతులపై ఎనలేని అభిమానం: వెంకయ్యనాయుడు
ABN, Publish Date - Jun 04 , 2026 | 09:48 PM
గాన గంధర్వుడు ఎస్బీ బాలసుబ్రహ్మణ్యానిది గొప్ప వ్యక్తిత్వమని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. తెలుగు భాష, సంస్కృతులపై ఆయనకు ఎనలేని అభిమానం ఉందన్నారు. నెల్లూరులో స్థానిక అన్నమయ్య సర్కిల్లోని ఎన్టీఆర్ పార్క్ వద్ద ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని గురువారం (జూన్ 3వ తేదీ) వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
1/8
గాన గంధర్వుడు ఎస్బీ బాలసుబ్రహ్మణ్యానిది గొప్ప వ్యక్తిత్వమని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. తెలుగు భాష, సంస్కృతులపై ఆయనకు ఎనలేని అభిమానం ఉందన్నారు.
2/8
ఎంతో మంది పిల్లల్లోని ప్రతిభా పటవాలను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వెలికి తీశారని తెలిపారు. నెల్లూరులో స్థానిక అన్నమయ్య సర్కిల్లోని ఎన్టీఆర్ పార్క్ వద్ద ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని గురువారం (జూన్ 3వ తేదీ) ఎం. వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
3/8
ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోపాటు సంగీత దర్శకులు కీరవాణి, మణిశర్మ, గాయకుడు మనో తదితరులు హజరయ్యారు.
4/8
సినీ రంగానికి ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం అందించిన సేవలను కొనియాడిన కీరవాణి
5/8
తండ్రి, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ఎస్పీ చరణ్.
6/8
ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరిలో పాడుతున్న గాయకుడు మనో.
7/8
పాటలు పాడుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సోదరి ఎస్పీ శైలజ.
8/8
ఈ కార్యక్రమానికి భారీగా హాజరైన ఎస్పీబీ అభిమానులు
Updated at - Jun 04 , 2026 | 10:01 PM