Share News

వాషింగ్టన్ డీసీలో శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం

ABN , Publish Date - Feb 25 , 2026 | 10:04 PM

గతేడాది డిసెంబర్ 6న డి.సి. మెట్రో ప్రాంతంలో నిర్వహించిన శంకర నేత్రాలయ (SN) నిధుల సేకరణ కార్యక్రమం విశేష విజయాన్ని సాధించింది.

వాషింగ్టన్ డీసీలో శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
Shankara Nethralaya fundraiser USA

గతేడాది డిసెంబర్ 6న డి.సి. మెట్రో ప్రాంతంలో నిర్వహించిన శంకర నేత్రాలయ (SN) నిధుల సేకరణ కార్యక్రమం విశేష విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిష్టాత్మక నేత్ర వైద్య సంస్థ కోసం మొత్తం 150,000 డాలర్లు నిధులు సమీకరణ జరిగింది. సంస్కృతి, కరుణను ప్రతిబింబించే ఈ వేడుకకు చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రమణ రెడ్డి మడ్డికుంట, CapEx సభ్యుడు తిరుమల రెడ్డి మునుకుంట్ల నాయకత్వం వహించారు.

కార్యక్రమం థీమ్ కరుణ ప్రతిధ్వనించేలా నిర్వహించబడింది. శాస్త్రీయ, సాంప్రదాయ నృత్య కళలతో సేవా భావాన్ని మేళవిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక అకాడమీలు పాల్గొని యువ, వయోజన నర్తకుల అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సాంస్కృతిక బృంద సభ్యురాలు లక్ష్మి బాబు సమన్వయంతో నృత్య ప్రదర్శనలు అత్యంత క్రమబద్ధంగా జరిగాయి.

ఈ వేడుకకు గౌరవ అతిథిగా ఎస్. వి. ఆచార్య హాజరై తమ ప్రోత్సాహకర సందేశంతో కార్యక్రమానికి మరింత గౌరవాన్ని చేకూర్చారు. అలాగే 11 మంది MESU స్పాన్సర్ల మద్దతు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కీలకమైంది.

2.jpg

ఉదార హృదయంతో సహకరించిన MESU స్పాన్సర్లు:

సెల్వ & ప్రతిభ జయరామన్, భువనేశ్ బూజాల, బానుమతి రామకృష్ణ, శ్రవణ్ పడూరు, కృష్ణకాంత్ కుచ్చలకంటి, ప్రవీణ్ పాల్‌రెడ్డి, రఘు పాల్‌రెడ్డి, వెంకట్ దోమా, తిరుమల మునుకుంట్ల, రఘు జువ్వాది. వీరి ఆర్థిక, కార్యనిర్వహణ సహకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది.

SNUSA నేషనల్, డి.సి. మెట్రో చాప్టర్ సభ్యులు విశేషంగా సహకరించారు. ముఖ్యంగా నీలిమ గడ్డమనుగు, కృష్ణ రాజ్ భట్, సౌమ్య నారాయణన్, డి.సి. చాప్టర్ నాయకులు బాలాజీ రాధాకృష్ణన్, హరిత రెడ్డి, అర్జున్ కామిసెట్టి, దిలీరాజ్ చాంతివేలు, రూపేష్ చిన్నకంపల్లి, కార్తిక్ గౌడ్ తదితరుల కృషి ప్రశంసనీయమని నిర్వాహకులు తెలిపారు.


SNUSA అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి నాయకత్వం, బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సభ్యుల మార్గదర్శకత్వం ఈ విజయానికి బలమైన ఆధారంగా నిలిచాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ట్రెజరర్ మూర్తి రేకపల్లి లాజిస్టిక్స్ నిర్వహణలో విశేష కృషి చేయగా, మీడియా సహకారం అందించిన గిరి కోటగిరి సేవలు అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువ వాలంటీర్లు, మీడియా, ఫోటోగ్రఫీ బృంద సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

మాస్టర్ ఆఫ్ సెరిమనీగా వ్యవహరించిన శ్రియా బాబు తన చక్కని వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని చురుకుగా, సమర్థవంతంగా ముందుకు నడిపించారు.

ఈ కార్యక్రమంలో సమీకరించిన నిధులు శంకర నేత్రాలయ లక్ష్యమైన అవసరమైన వారికి నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించేందుకు వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమం ముగిసే సమయానికి సేవా భావం, ఐక్యత, సామాజిక బాధ్యత స్పష్టంగా ప్రతిఫలించాయి. ఈ వేడుక కేవలం కళలు, సంస్కృతిని మాత్రమే కాకుండా, సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరి హృదయంలో మరింత బలంగా నాటింది.

5.jpg4.jpg3.jpg


ఈ వార్తలూ చదవండి:

వెంకన్న భక్తులకు వైసీపీ క్షమాపణ చెప్పాలి: గల్ఫ్ టీడీపీ నేత

ఒమాన్‌లో తెలుగు సామాజిక కార్యకర్తలకు రాయబారి అభినందన

Updated Date - Feb 26 , 2026 | 09:06 AM