Share News

పిల్లలు బలహీనంగా ఉన్నారా..?

ABN , Publish Date - Jul 09 , 2026 | 04:52 AM

పిల్లలు నీరసంగా బలహీనంగా కనిపిస్తుంటే వారికి ఎలాంటి ఆహారం తినిపించాలో తెలుసుకుందాం...

పిల్లలు బలహీనంగా ఉన్నారా..?

పేరెంటింగ్‌

పిల్లలు నీరసంగా బలహీనంగా కనిపిస్తుంటే వారికి ఎలాంటి ఆహారం తినిపించాలో తెలుసుకుందాం...

  • పిల్లలకు రోజూ ఒక అరటిపండును తినిపించాలి. దీనిలోని ఎ, బి, సి విటమిన్లు; మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్‌ కలిసి తక్షణ శక్తిని అందిస్తాయి. రాత్రిపూట గాఢంగా నిద్ర పట్టేలా చేస్తాయి. దీంతో పిల్లల్లో చురుకుదనం పెరుగుతుంది

  • రోజూ భోజనంలో నెయ్యిని చేరిస్తే శరీరానికి కావాల్సిన మంచి కొవ్వులు లభిస్తాయి. సరైన పోషణ అంది పిల్లలు బరువు పెరుగుతారు. అలాగే రాత్రి పడుకునేముందు గ్లాసు పాలలో కొద్దిగా తేనె కలిపి తాగిస్తుంటే క్రమంగా నీరసం తగ్గి పిల్లలు ఉత్సాహంగా ఆడుకుంటారు.

  • పెరుగు, జున్ను, చీజ్‌లను తినిపిస్తుంటే ఎ, బి, డి, ఇ విటమిన్లతోపాటు కాల్షియం, ప్రోటీన్లు అంది పిల్లలు బలంగా పెరుగుతారు.

  • ఉడికించిన కోడిగుడ్లు, మెంతికూర, పాలకూర, తాజా కూరగాయలు, పండ్లు, మొలకలు, పప్పు ధాన్యాలను ఆహారంలో చేరిస్తే ప్రోటీన్లు, పీచులు, ఇతర పోషకాలు అంది పిల్లల్లో నీరసం, బలహీనత తగ్గుతాయి.

  • సాల్మన్‌, ట్యూనా, సార్డిన్‌ లాంటి చేపలతో తయారుచేసిన వంటకాలు తినిపిస్తుంటే వాటిలోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఐరన్‌, కాల్షియం ప్రభావవంతంగా పనిచేసి పిల్లల్లో చురుకుదనాన్ని పెంచుతాయి.

  • పిల్లలకు బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్‌, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్‌ గింజలు, ఖర్జూరం, కిస్‌మి్‌సలను తినిపిస్తుంటే వారిలో రక్తహీనత తగ్గుతుంది. కండరాలు వృద్ధి చెందుతాయి. ఎముకలు బలోపేతమవుతాయి. జీవక్రియలు వేగవంతమై పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు.. ఒక్కరోజులో రూ.8.4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి

ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్‌న్యూస్‌..!

Updated Date - Jul 09 , 2026 | 04:52 AM