స్నేహం పేరు చెప్పి తప్పించుకోలేరు.. టీనేజర్ హత్యపై యూపీ సీఎం వ్యాఖ్య
ABN , Publish Date - Jun 01 , 2026 | 07:13 PM
యూపీలో టీనేజర్ హత్యపై రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. స్నేహం మాటున హింసాత్మక ఘటనలకు దిగితే సహించబోమని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: యూపీలో ఇటీవల కలకలం రేపిన సూర్య అనే టీనేజర్ హత్యపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బిజ్నోర్లో ఒక ర్యాలీలో ఆయన మాట్లాడుతూ స్నేహం మాటున హింసాత్మక చర్యలకు దిగితే సహించేది లేదని అన్నారు. తప్పుడు మార్గాల్లో వెళుతున్న పిల్లలను సక్రమమార్గంలో మళ్లించలేని తల్లిదండ్రులు పెద్ద తప్పు చేస్తున్నట్టేనని హెచ్చరించారు. చట్టప్రకారం నడుచుకునే వారికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.
అహింస, మానవత్వం సమాజాన్ని సుసంపన్నం చేసే ఆభరణాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. తప్పు జరిగినప్పుడు దీటుగా స్పందించక తప్పదని కూడా చెప్పారు. ఖరదూషనాదులు వంటి రాక్షస శక్తులను ఎదుర్కొనేటప్పుడు ఆయుధాల చేతపట్టకతప్పదని చెప్పారు. దేశంలోని వారందరూ చట్టానికి లోబడే ఉండాలని స్పష్టం చేశారు.
బక్రీద్ రోజున సూర్య (19) హత్యకు గురైన విషయం తెలిసిందే. బైక్ నడిపే విషయంలో తగాదా తలెత్తడంతో స్నేహితులే అతడిని హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్ పోలీస్ ఎన్కౌంటర్లో కన్నుమూశాడు. మిగిలిన వారిని పోలీసులు అంతకుముందే అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే యూపీ సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
నేను సీఎంను కాను.. ప్రజా సేవకుడిని: తమిళనాడు సీఎం విజయ్
యూఎస్తో ట్రేడ్ డీల్.. 99 శాతం చర్చలు పూర్తి: మంత్రి పీయూష్ గోయల్