21వ రోజుకు దీక్ష.. వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించిన పోలీసులు..
ABN , Publish Date - Jul 18 , 2026 | 07:51 AM
ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్న శిబిరం వద్దకు వెళ్లారు. బలవంతంగా అక్కడినుంచి ఆయనను ఆస్పత్రికి తరలించారు.
న్యూఢిల్లీ, జులై 18: విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ జూన్ 28వ తేదీ నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం నాటికి ఆమరణ నిరాహార దీక్ష 21వ రోజుకు చేరుకుంది. వాంగ్చుక్ ఆరోగ్యం తీవ్రంగా కృశిస్తోందని, దీక్ష ఇంకా కొనసాగితే ఆయన శరీరంలోని కీలక అవయవాలు పని చేయటం మానేసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్న శిబిరం వద్దకు వెళ్లారు. బలవంతంగా అక్కడినుంచి ఆయనను ఆస్పత్రికి తరలించారు.
వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి ఇది..
గత 20 రోజులుగా కేవలం ఉప్పు నీరు మాత్రమే తీసుకుంటూ దీక్ష చేయడం వల్ల వాంగ్చుక్ దాదాపు 20 శాతం బరువు కోల్పోయారు. సుమారు 9 కేజీలకు పైగా బరువు తగ్గారు. ప్రస్తుతం ఆయన బరువు 56.55 కిలోలు మాత్రమే. వైద్యులు చెబుతున్న దాని ప్రకారం.. ఆయన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగాయి. కండరాల క్షీణతతో ఆరోగ్యం బాగా దెబ్బతింది. డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీక్ష ఇలాగే కొనసాగి ఉంటే ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లేది.
ఇవి కూడా చదవండి
కూకట్పల్లి రైతుబజార్లో నేటి ధరల వివరాలివే..
హోర్ముజ్పై పోరు.. అమెరికా-ఇరాన్ దాడులు మరింత తీవ్రం