Share News

ఎన్నికల్లో పోటీ చేయను.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం..

ABN , Publish Date - Jul 26 , 2026 | 04:37 PM

కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

ఎన్నికల్లో పోటీ చేయను.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం..
Karnataka Elections 2028

ఇంటర్‌నెట్ డెస్క్: కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ఈ రోజుల్లో రాజకీయ రంగం కలుషితమైపోయింది. నేను 2028 విధానసభ ఎన్నికలలో పోటీ చేయను. కానీ, క్రియాశీల రాజకీయాల్లోనే ఉంటాను. ప్రజల కష్టసుఖాలలో వారికి తోడుగా నిలిచి.. వారి గొంతుకగా మారతాను. మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని వరుణ నియోజకవర్గ ప్రజలు నన్ను ఒత్తిడి చేస్తున్నారు. కానీ, నేను ఇకపై ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను’ అని అన్నారు.

Updated Date - Jul 26 , 2026 | 04:52 PM