Share News

‘న్యూస్‌క్లిక్‌’కు ఈడీ 184 కోట్ల పెనాల్టీ

ABN , Publish Date - Feb 17 , 2026 | 06:00 AM

మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న వార్తా సంస్థ ‘న్యూస్‌క్లిక్‌’, దాని ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌లకు ఈడీ రూ.184 కోట్ల కోట్ల పెనాల్టీ విధించింది...

‘న్యూస్‌క్లిక్‌’కు ఈడీ 184 కోట్ల పెనాల్టీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న వార్తా సంస్థ ‘న్యూస్‌క్లిక్‌’, దాని ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌లకు ఈడీ రూ.184 కోట్ల కోట్ల పెనాల్టీ విధించింది. న్యూస్‌క్లిక్‌ న్యూస్‌ పోర్టల్‌ను నిర్వహిస్తున్న ‘పీపీకే న్యూస్‌క్లిక్‌ స్టూడియో ప్రైవేట్‌ లిమిటెడ్‌’కు రూ.120 కోట్లు, ఆ సంస్థ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ప్రబీర్‌ పుర్కాయస్థకు రూ.64 కోట్ల జరిమానా విధించినట్లు సోమవారం ప్రకటించింది. ఈ సంస్థపై మనీలాండరింగ్‌ ఆరోపణలు రావటంతో 2021 సెప్టెంబరులో ఢిల్లీలోని సైదులజబ్‌లో ఉన్న సంస్థ కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల అనంతరం ఈ సంస్థ ఫెమాను ఉల్లంఘించినట్లు ఈడీ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి..

దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 17 , 2026 | 06:00 AM