రేపు ఢిల్లీలో భారీ ర్యాలీ చేపట్టనున్న సీపీఐ
ABN , Publish Date - Aug 31 , 2026 | 02:01 PM
సీపీఐ ఆధ్వర్యంలో ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో రేపు భారీ ర్యాలీ జరగనుంది. 12 ఏళ్ల పాలనలో మోదీ వైఫల్యాలను నినదిస్తూ సీపీఐ ఈ ర్యాలీ చేపట్టనుంది. 'బదలావ్ జరూరీ హై' అనే పేరుతో చేపట్టనున్న ఈ ర్యాలీలో దేశవ్యాప్తంగా ఉన్న సీపీఐ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సీపీఐ ఆధ్వర్యంలో ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో రేపు(మంగళవారం) భారీ ర్యాలీ జరగనుంది. 12 ఏళ్ల పాలనలో మోదీ వైఫల్యాలను నినదిస్తూ సీపీఐ ఈ ర్యాలీ చేపట్టనుంది. 'బదలావ్ జరూరీ హై' అనే పేరుతో చేపట్టనున్న ఈ ర్యాలీలో దేశవ్యాప్తంగా ఉన్న సీపీఐ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. పన్నేండేళ్ల పాలనలో మోదీ ప్రధానిగా విఫలమయ్యారని విమర్శించారు. మైనారిటీల విషయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అమెరికాలో చేసిన వ్యాఖ్యలు ఇండియాలో ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. దేశ రాజధానిలో నిర్వహించే ఈ ర్యాలీలో డి.రాజా సహా పలువురు జాతీయ నేతలు పాల్గొంటారు. అంతేకాకుండా.. ఏపీ, తెలంగాణ నుంచి సీపీఐ శ్రేణులు భారీగా పాల్గొననున్నాయి.
పన్నేండేళ్ల పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను రామకృష్ణ కింది విధంగా పేర్కొన్నారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అమలు కాలేదు.
అవినీతిని నిరోధించడంలో ప్రభుత్వం విఫలమైంది.
వన్ నేషన్–వన్ ఎలక్షన్ ద్వారా సమాఖ్య వ్యవస్థను బలహీనపరచడానికి కుట్ర పన్నుతోంది.
డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చూస్తోంది.
మైనారిటీల భద్రతను గాలికి వదిలేసింది.
ధరల పెరుగుదలను అరికట్టలేకపోయింది.
నిరుద్యోగాన్ని నిర్మూలించలేకపోయింది.