రాష్ట్రాలకు మూలధన రుణాలివ్వాలంటే
ABN , Publish Date - Apr 08 , 2026 | 06:16 AM
సాస్కీ(స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వె్స్టమెంట్) పథకంలో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాలకు మూలధన వ్యయ...
ఎరువుల డేటాతో రైతు ఐడీ లింక్ చేయాలి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: సాస్కీ(స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వె్స్టమెంట్) పథకంలో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాలకు మూలధన వ్యయ(క్యాపెక్స్) రుణాల మంజూరుకు కేంద్రం కొత్త షరతులు రూపొందించింది. ఇందులో టెలికాం టవర్ల క్లియరెన్స్కు సంబంధించిన సంస్కరణలు, రైతుల డేటా బేస్ నిర్మాణం, కౌలు రైతుల గుర్తింపు కోసం ఎరువుల వినియోగ డేటాతో రైతుల ఐడీ అనుసంధానం వంటివి ఉన్నాయి. వీటితోపాటు గత ఆర్థిక సంవత్సరంలో తీసుకొచ్చిన సంస్కరణలు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. సాస్కీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.25,000 కోట్ల నిధిని పక్కనబెట్టింది. సంస్కరణలు వేగంగా అమలుచేసిన రాష్ట్రాలకు ఈ నిధులను ప్రాధాన్యతా క్రమంలో ఇస్తారు. ఈ రుణాలకు 50 ఏళ్లపాటు వడ్డీ ఉండదు.
ఇవి కూడా చదవండి..
యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..