పశ్చిమాసియాలో శాంతికి సహకరిస్తాం
ABN , Publish Date - May 16 , 2026 | 03:56 AM
పశ్చిమాసియాలో శాంతికి తమ శాయశక్తులా సహకరిస్తామిన ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన యూఏఈ రాజధాని అబూధాబీ చేరుకున్నారు.
యూఏఈ అధ్యక్షుడితో మోదీ భేటీ
చమురు నిల్వలు, ఎల్పీజీ సరఫరా సహా7 కీలక వ్యూహాత్మక ఒప్పందాలు
అబూధాబీ, మే 15: పశ్చిమాసియాలో శాంతికి తమ శాయశక్తులా సహకరిస్తామిన ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన యూఏఈ రాజధాని అబూధాబీ చేరుకున్నారు. ఆ దేశాధ్యక్షుడు షేక్ మొహమద్ బియన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారు. ఇంధన, రక్షణ, టెక్నాలజీ రంగాల్లో ఏడు కీలక భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేశా రు. అల్ నహ్యాన్తో చర్చల ప్రారంభంలోనే.. యూఏఈపై (ఇరాన్) దాడులను మోదీ ఖండించారు. ఈ దేశంలో అమెరికాకు చెందిన అతిపెద్ద సైనిక స్థావ రం ఉండడంతో ఇరాన్ తరచూ దాడులు చేస్తోంద ని, ఇది ఆమోదయోగ్యం కాదని మోదీ స్పష్టంచేశారు. ఈ సందర్భంగా భారత్లో 5 బిలియన్ డాలర్ల (రూ.47,931 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు అల్ నహ్యాన్ ప్రకటించారు. దీనివల్ల ద్వైపాక్షిక ఆర్థిక బంధం మరింత బలోపేతమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. రెండున్నర గంటల చర్చల అనంతరం మోదీ అక్కడి నుంచి నెదర్లాండ్స్ బయల్దేరారు.