10వ తరగతి విద్యార్థిపై దాడి! 30 సెకెన్లలో 27 కత్తిపోట్లు
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:43 PM
భోపాల్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిపై ఇద్దరు బాలురు కత్తులతో దాడి చేశారు. కేవలం అర నిమిషంలో 27 సార్లు కత్తులతో పొడిచారు.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్లో విద్యార్థుల మధ్య గొడవ షాకింగ్ మలుపు తిరిగింది. సాటి విద్యార్థుల దాడిలో ఓ బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడిపై ఇద్దరు టీనేజర్లు దాడికి తెగబడి అర నిమిషంలో 30 సార్లు కత్తులతో ఇష్టారీతిన పొడిచారు. భోపాల్లో ఫిబ్రవరి 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి సంబంధించిన వీడియోను టీనేజర్లు స్వయంగా నెట్టింట పంచుకున్నట్టు తెలుస్తోంది(Bhopal Stabbed in Snooker Club).
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఓ స్నూకర్ క్లబ్లో ఈ ఘటన వెలుగు చూసింది. స్నూకర్ క్లబ్లోకి రాగానే బాధితుడిపై ఇద్దరు బాలురు ఇష్టారీతిన దాడికి దిగారు. కేవలం అర నిమిషంలో 27 సార్లు కత్తులతో పొడిచారు. ఈ దాడిలో బాధితుడి భుజాలు, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. రెండు వేళ్లు తెగిపడ్డాయి. బాధితుడు ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్నాడు. సినీఫక్కీలో నిమిషాల వ్యవధిలో దాడిచేసిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ముగ్గురు టీనేజర్లు స్థానికంగా ఓ కోచింగ్ సెంటర్లో చదువుకునే వారని పోలీసులు తెలిపారు. అయితే, ఆటలో పైచేయి ఎవరిదనే విషయంలో వారి మధ్య గతంలో వివాదం చెలరేగిందని తెలిపారు. ఆ సమయంలో బాధితుడు ఇద్దరు టీనేజర్లపై చేయి చేసుకున్నాడని చెప్పారు. ఇందుకు ప్రతీకారంగానే వారు ఇలా దాడికి తెగబడినట్టు పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి గాయాల తీవ్రతను బట్టి అదనపు సెక్షన్లను జోడిస్తామని తెలిపారు. ఇక టీనేజర్ల మధ్య ఈ స్థాయిలో వివాదం రేగడంతో భోపాల్లో కలకలానికి దారి తీసింది. తల్లిదండ్రులు, అధ్యాపకుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఈ వార్తలూ చదవండి:
మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంతలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య
చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన పోలీసులు.. వీడియో వైరల్