ట్రంప్ 'హోర్ముజ్' దిగ్బంధనం.. అంతర్జాతీయ షిప్పింగ్ రంగంలో చారిత్రాత్మక సంక్షోభం!
ABN , Publish Date - Apr 26 , 2026 | 12:05 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం కారణంగా అంతర్జాతీయ షిప్పింగ్ రంగం చరిత్రలో ఎన్నడూ లేనంతటి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది.
ఇంటర్నెట్ డెస్క్, ఏప్రిల్ 26: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం కారణంగా అంతర్జాతీయ షిప్పింగ్ రంగం చరిత్రలో ఎన్నడూ లేనంతటి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. సాధారణంగా రోజుకు సగటున 135 నౌకలు ప్రయాణించే ఈ జలసంధిలో, ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల రవాణా దాదాపు సున్నాకు చేరుకుంది. ఇరాన్తో సంబంధం ఉన్న నౌకలను అమెరికా అడ్డుకుంటుండగా, ప్రతిస్పందనగా ఇరాన్ తన 'గన్బోట్'లతో ఈ మార్గాన్ని మూసివేస్తోంది.
మరోవైపు, 'మరికొంత సమయం ఇస్తే, హోర్ముజ్ జలసంధిని సులభంగా తెరిచి, చమురును స్వాధీనం చేసుకుని భారీ లాభాలు గడించవచ్చు' అంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ముడి చమురు ఉత్పత్తి ఇప్పటికే 57శాతం పడిపోయింది. ఈ జలసంధి ప్రాంతంలో సుమారు 20,000 మంది నావికులు వివిధ నౌకల్లో చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం షిప్పింగ్ కంపెనీలకు పెద్ద సవాలుగా మారింది.
ఒకప్పుడు సురక్షితమైన ఈ మార్గం ఇప్పుడు యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. అమెరికా తన దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు పరిస్థితి చక్కబడేలా లేదని షిప్పింగ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్షోభం కేవలం ఆసియా దేశాలకే కాకుండా, అమెరికాతో సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ నాయకుల మధ్య విభేదాలు.. లీక్ అయిన రహస్య లేఖలో ఏముంది..
నా ఇంట్లోనే నన్ను గుండాతో కొట్టించారు.. కేజ్రీవాల్పై ఎంపీ స్వాతి సంచలన ఆరోపణలు..