టెక్ మహీంద్రా లాభంలో 14 శాతం వృద్ధి
ABN , Publish Date - Jan 17 , 2026 | 06:01 AM
ఐటీ సర్వీసుల రంగంలోని మరో కంపెనీ టెక్ మహీంద్రా మూడో త్రైమాసికంలో రూ.1,122 కోట్ల లాభాన్ని...
ఐటీ సర్వీసుల రంగంలోని మరో కంపెనీ టెక్ మహీంద్రా మూడో త్రైమాసికంలో రూ.1,122 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.983.2 కోట్లతో పోల్చితే లాభం 14.11ు పెరిగింది. ఇదే కాలంలో ఆదాయం రూ.13,286 కోట్ల నుంచి రూ.14,393 కోట్లకు పెరిగింది. డిసెంబరు 31 నాటికి కంపెనీలో 1,49,616 మంది పని చేస్తున్నారని, ఏడాది కాలంలో ఉద్యోగుల సంఖ్య 872 తగ్గిందని, ఉద్యోగుల వలస రేటు 12.3ు ఉన్నదని తెలిపింది.
ఇవీ చదవండి:
30 వాట్స్ లేదా 60 వాట్స్ చార్జర్.. బ్యాటరీ మన్నికకు ఏది బెటర్?
వైద్య కళాశాలల అవసరం భవిష్యత్తులో ఉండదు.. ఎలాన్ మస్క్ వ్యాఖ్య