ఐపీఓల్లో పబ్లిక్కు మరిన్ని షేర్లు
ABN , Publish Date - Mar 16 , 2026 | 01:01 AM
ఐపీఓలకు వచ్చే కంపెనీలు రిటైల్, నాన్ రిటైల్ ఇన్వెస్టర్లు, సంస్థాగత మదుపరులకు షేర్లు కేటాయించే విధానాన్ని ప్రభుత్వం మార్చింది. దీనికి సంబంధించి...
నిబంధనలు మార్చిన ఆర్థిక మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ: ఐపీఓలకు వచ్చే కంపెనీలు రిటైల్, నాన్ రిటైల్ ఇన్వెస్టర్లు, సంస్థాగత మదుపరులకు షేర్లు కేటాయించే విధానాన్ని ప్రభుత్వం మార్చింది. దీనికి సంబంధించి కేంద్రఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం..
ఐపీఓ తర్వాత రూ.1,600 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల మూలధనం ఉండే కంపెనీల ఈక్విటీల్లో పబ్లిక్ వాటా మూడేళ్లలో కనీసం 25ు ఉండాలి.
ఈ ఇష్యూల్లో కనీసం 2.5ు షేర్లు లేదా కన్వర్టబుల్ డిబెంచర్లను పబ్లిక్కు కేటాయించాలి.
ఐపీఓ తర్వాత రూ.1,600 కోట్ల వరకు ఈక్విటీ ఉన్న కంపెనీలు, తమ షేర్లు లేదా కన్వర్టబుల్ డిబెంచర్లలో కనీసం 25 శాతం పబ్లిక్కు జారీ చేయాలి.
లిస్టింగ్ తర్వాత ఈక్విటీ రూ.1,600 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల లోపు ఉన్న కంపెనీలు కనీసం రూ.4,000 కోట్లవిలువైన షేర్లను పబ్లిక్కు జారీ చేయాలి.
లిస్టింగ్ తర్వాత రూ.4,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీలు తమ ఈక్విటీ షేర్లు లేదా కన్వర్టబుల్ డిబెంచర్లలో కనీసం 10ు పబ్లిక్కు జారీ చేయాలి.
ఐపీఓల తర్వాత రూ.5,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల లోపు ఈక్విటీ ఉన్న కంపెనీలైతే తమ ఈక్విటీలో కనీ సం రూ.1,000 కోట్ల విలువైన షేర్లను లేదా ఎనిమిది శాతం షేర్లు లేదా కన్వర్టబుల్ డిబెంచర్లను పబ్లిక్కు జారీ చేసి ఆ తర్వాత ఐదేళ్లలో ఈ వాటాను 25 శాతానికి పెంచాలి.
ఐపీఓ తర్వాత రూ.లక్ష కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీలు కనీసం రూ.6,250 కోట్ల విలువైన షేర్లతో పాటు, షేర్లు, కన్వర్టబుల్ డిబెంచర్లలో 2.5 శాతం పబ్లిక్కు జారీ చేయాలి.
లిస్టింగ్ సమయంలో సగటు ఇన్వెస్టర్ల వాటా 15ు లోపు ఉన్న కంపెనీలు ఆ వాటాను ఐదేళ్లలో 15 శాతానికి, పదేళ్లలో 25 శాతానికి పెంచాలి.
లిస్టింగ్ సమయంలో 15 శాతానికి మించి ప్రజల వాటా ఉన్న కంపెనీలు ఐదేళ్లలో ఆ మొత్తాన్ని 25 శాతానికి పెంచాలి.
ఈ నిబంధనలు పాటించని కంపెనీలపై జరిమానాలు విధించే అధికారం సెబీకి అప్పగింత.
ఇవి కూడా చదవండి:
వామ్మో దారుణం.. ఈ ఏనుగు ఎలా దాడి చేసిందో చూడండి..
డుడుమ జలపాతం అందాలకు ఆనంద్ మహీంద్రా ఫిదా