రిలయన్స్ ఇండస్ట్రీస్ రూపీ బాండ్ల జారీ!
ABN , Publish Date - Sep 09 , 2026 | 04:17 AM
భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వచ్చే వారంలో రూపీ బాండ్ల జారీ ద్వారా రూ.12,500 కోట్ల వరకు సమీకరించే ఆలోచనలో...
రూ.12,500 కోట్ల వరకు సమీకరించనున్న సంస్థ
2023 నవంబరు తర్వాత ఇదే మొదటిసారి
న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వచ్చే వారంలో రూపీ బాండ్ల జారీ ద్వారా రూ.12,500 కోట్ల వరకు సమీకరించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ట్రిపుల్ ఏ రేటింగ్తో కూడిన ఐదేళ్ల కాలపరిమితి బాండ్లపై రిలయన్స్ 7.47 శాతం వార్షిక వడ్డీ ఆఫర్ చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశీయ కరెన్సీ బాండ్ల జారీ ద్వారా రిలయన్స్ నిధులు సమీకరించనుండటం దాదాపు మూడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. అంతేకాదు, ఈ ఏడాది దేశీయ మార్కెట్లో అతిపెద్ద లిస్టెడ్ బాండ్ల జారీ కానుంది. 2023 నవంబరులో ఆర్ఐఎల్ రూపీ బాండ్ల జారీ ద్వారా రూ.20,000 కోట్లు సమీకరించింది. ఈ నెల 18న ఈ బాండ్ల ఇష్యూ ప్రారంభం కానుందని సమాచారం. అంతేకాదు, ఆర్ఐఎల్ 10 ఏళ్ల కాలపరిమితి బాండ్ల జారీ ఆలోచనలో కూడా ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి:
గిల్పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!
అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్