కార్యాలయ స్థలాలపై రీట్స్ ఆసక్తి
ABN , Publish Date - Sep 09 , 2026 | 04:08 AM
బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లోని ఆఫీస్ స్పేస్పై దేశంలోని రియల్ ఎస్టేట్ ఇన్వె్స్టమెంట్ ట్రస్ట్స్ (రీట్స్)...
బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలే ముద్దు
అసోచామ్-నైట్ ఫ్రాంక్ నివేదిక
న్యూఢిల్లీ: బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లోని ఆఫీస్ స్పేస్పై దేశంలోని రియల్ ఎస్టేట్ ఇన్వె్స్టమెంట్ ట్రస్ట్స్ (రీట్స్) పెద్దఎత్తున ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం లిస్టెడ్ విభాగంలో ఉన్న రీట్స్ తమ మొత్తం పెట్టుబడుల్లో 62 శాతం ఈ మూడు నగరాల్లోని కార్యాలయ స్థలాలపైనే మదుపు చేశాయి. అసోచామ్, ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ఈ విషయం తెలిపింది.
ఇతర ముఖ్యాంశాలు
జూన్ నాటికి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 105.46 కోట్ల ఎస్ఎ్ఫటీ ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంది.
ఇందులో 16.7 కోట్ల ఎస్ఎ్ఫటీ కార్యాలయ స్థలం..లిస్టెడ్ రీట్స్ చేతిలో ఉంటే, అందులో 10.35 కోట్ల ఎస్ఎ్ఫటీ ఆఫీస్ స్పేస్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల్లో ఉంది.
హైదరాబాద్లో లిస్టెడ్ రీట్స్ చేతిలో 262 లక్షల ఎస్ఎ్ఫటీ కార్యాలయ స్థలం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా
రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు