లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్
ABN , Publish Date - Feb 13 , 2026 | 05:37 AM
లోన్ (రుణ) రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్ పడనుంది. దీనికి సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గురువారం బ్యాంకులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఏజెంట్లకు...
కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్బీఐ
రుణగ్రహీతలకు చేసే ఫోన్ కాల్స్ రికార్డు చేయాల్సిందే..
ముంబై: లోన్ (రుణ) రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్ పడనుంది. దీనికి సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గురువారం బ్యాంకులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఏజెంట్లకు సరైన శిక్షణతో పాటు రుణ గ్రహీతలకు వారు చేసే ఫోన్ కాల్స్ను తప్పనిసరిగా రికార్డు చేయాలని కోరింది. రుణ వసూళ్ల కోసం బ్యాంకు ఉద్యోగులు లేదా రికవరీ ఏజెంట్లు అతిగా ప్రవర్తిస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో ఆర్బీఐ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రధాన మార్గదర్శకాలు
ఎంపికకు ముందే బ్యాంకులు రికవరీ ఏజెంట్ల పూర్వాపరాలు తెలుసకోవాలి
నియమించిన తర్వాత వారికి రుణ వసూళ్లలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ఐఐబీఎ్ఫ)లో సరైన శిక్షణ ఇవ్వాలి
రుణ వసూళ్ల కోసం ఏజెంట్లు ఖాతాదారులపై ఎలాంటి అనుచిత భాష ఉపయోగించ కూడదు
రుణగ్రహీతల పరువు, ప్రతిష్ఠలు, గౌరవ మర్యాదలను దెబ్బతీయకూడదు
రుణగ్రహీత కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు, ప్రకృత్తి విపత్తులు, పెళ్లిళ్లు, పండగల సమయంలో రుణ వసూళ్ల కోసం వారి ఇళ్లకు వెళ్లకూడదు
రుణగ్రహీతలకు పంపించే సందేశాలు కూడా హుందాగా ఉండాలి
నిర్ణీత కాలవ్యవధిలో రికవరీ ఏజెంట్లకు పునఃశిక్షణ ఇవ్వాలి
బ్యాంకు ఉద్యోగులు, రికవరీ ఏజెంట్ల వద్ద ఉన్న రుణ గ్రహీతల సమాచారాన్ని దుర్వినియోగం చేయకూడదు
రుణ వసూలు విషయం కోర్టు విచారణలో ఉంటే అత్యంత జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులు.. తమ ఉద్యోగులు, రికవరీ ఏజెంట్లకు చెప్పాలి.
ఇవి కూడా చదవండి..
చెత్త బుట్టలో పడేసినా.. దొరికేసిన బంగారం.. దుబాయ్లో ఏం జరిగిందంటే..
స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..