ఇజెనిసిస్ ఇంక్లో రూ.130 కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Aug 26 , 2026 | 05:29 AM
అమెరికాలోని తన బయోటెక్నాలజీ కంపెనీ ‘ఇజెనిసిస్ ఇంక్’లో మరో 1.4 కోట్ల డాలర్లు...
నాట్కో ఫార్మా
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అమెరికాలోని తన బయోటెక్నాలజీ కంపెనీ ‘ఇజెనిసిస్ ఇంక్’లో మరో 1.4 కోట్ల డాలర్లు (సుమారు రూ.130 కోట్లు) పెట్టుబడి పెట్టాలని నాట్కో ఫార్మా నిర్ణయించింది. నాట్కో ఫార్మా (కెనడా), నాట్కో ఫార్మా సౌత్ఆఫ్రికా అనే అనుబంధ కంపెనీల ద్వారా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపింది. కిడ్నీలు, లివర్, గుండె వంటి అవయవాలు చెడిపోయిన రోగులకు జినోమ్ ఇంజనీరింగ్ ద్వారా కొత్త అవయవాల ఏర్పాటుకు అవసరమైన పరిశోధనలు ఇజెనిసిస్ ఇంక్ చేస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
ఏడేళ్ల తర్వాత భారత్కు జిన్పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!