మారుతి నుంచి సరికొత్త బ్రెజ్జా
ABN , Publish Date - Jul 25 , 2026 | 02:00 AM
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ.. మార్కెట్లోకి సరికొత్త ఎస్యూవీ బ్రెజ్జా విడుదల చేసింది...
ప్రారంభ ధర రూ.7.4 లక్షలు
న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ.. మార్కెట్లోకి సరికొత్త ఎస్యూవీ బ్రెజ్జా విడుదల చేసింది. టర్బో బూస్టర్జెట్, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ప్రొగ్రెసివ్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన కే15సీ డ్యూయల్ వీవీటీ ఇంజన్తో ఈ ఎస్యూవీని తీసుకువచ్చింది. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ.7,39,900. పెట్రోల్, సీఎన్జీ వెర్షన్స్లో కొత్త బ్రెజ్జా అందుబాటులో ఉంటుందని మారుతి తెలిపింది. ఈ ఎస్యూవీ ఇప్పటికే భారత్ ఎన్సీఏపీ నుంచి 5 స్టార్ రేటింగ్ను అందుకుందని వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు