అనుమతి ఉంటేనే ‘ఇండియన్ పేటెంట్ ఆఫీస్’ లోగో
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:09 AM
ఇండియన్ పేటెంట్ ఆఫీస్ అధికార చిహ్నం/గుర్తు దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం...
న్యూఢిల్లీ: ఇండియన్ పేటెంట్ ఆఫీస్ అధికార చిహ్నం/గుర్తు దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇక ఎవరూ ఈ చిహ్నం, గుర్తును ఉపయోగిచేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే అనధికారికంగా ఉపయోగిస్తున్న వ్యక్తులు, సంస్థలు వెంట నే ఆపేయాలని కోరింది. లేకపోతే చర్యలు తప్పవని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక అనుమతి లేకుండా ఎవరూ ఏ రూపంలోనూ ఇండియన్ పేటెంట్ ఆఫీస్ చిహ్నం ఉపయోగించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు
ఈఎంపీ షీల్డులు, హైటెక్ ఎన్క్రిప్షన్.. మిసైల్ దాడులనూ తిప్పికొట్టే జిన్ పింగ్ ఫ్లైట్.!