Share News

వచ్చే దశాబ్ది కాలంలో మరో రూ.180 లక్షల కోట్లు

ABN , Publish Date - Feb 19 , 2026 | 03:09 AM

వచ్చే దశాబ్దకాలంలో టెక్నాలజీ కంపెనీలు స్టాక్‌ మార్కెట్‌ విలువకు మరో రూ.2 లక్షల కోట్ల డాలర్ల (రూ.180 లక్షల కోట్లు) మేర జోడించవచ్చని...

వచ్చే దశాబ్ది కాలంలో మరో రూ.180 లక్షల కోట్లు

టెక్‌ కంపెనీలకు బొనాంజా

వచ్చే దశాబ్దకాలంలో టెక్నాలజీ కంపెనీలు స్టాక్‌ మార్కెట్‌ విలువకు మరో రూ.2 లక్షల కోట్ల డాలర్ల (రూ.180 లక్షల కోట్లు) మేర జోడించవచ్చని ప్రము ఖ వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ సంస్థ యాక్సెల్‌ పార్ట్‌నర్‌ అంచనా వేసింది. ప్రస్తుతం భారత మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో టెక్నాలజీ కంపెనీల వాటా కేవలం 4-5 శాతంగా ఉందని, వచ్చే 10 ఏళ్లలో ఈ వాటా 15-20 శాతానికి పెరగవచ్చన్నారు. అంటే, దేశంలోని పలు టెక్నాలజీ కంపెనీలు భవిష్యత్‌లో కనీసం 10,000 కోట్ల డాలర్ల (రూ.9 లక్షల కోట్లు) విలువైన కంపెనీలుగా అవతరించనున్నాయని కంపెనీ ప్రతినిధి ప్రయాంక్‌ స్వరూప్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి..

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం

Updated Date - Feb 19 , 2026 | 03:09 AM