Share News

25 శాతం తగ్గిన ఎయిర్‌పోర్ట్‌ చార్జీలు

ABN , Publish Date - Apr 09 , 2026 | 04:02 AM

ఇంధన భారంతో కుదేలవుతున్న దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం చిన్న ఊరట ప్రకటించింది. విమానాల ల్యాండింగ్‌, పార్కింగ్‌ కోసం...

25 శాతం తగ్గిన ఎయిర్‌పోర్ట్‌ చార్జీలు

న్యూఢిల్లీ: ఇంధన భారంతో కుదేలవుతున్న దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం చిన్న ఊరట ప్రకటించింది. విమానాల ల్యాండింగ్‌, పార్కింగ్‌ కోసం విమానాశ్రయాల్లో వసూలు చేసే చార్జీలను 25 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ తగ్గింపు వెంటనే అమల్లోకి వస్తుందని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మూడు నెలల పాటు ఈ తగ్గింపు అమల్లో ఉంటుంది. దీనివల్ల విమానాశ్రయాల నిర్వాహకులకు ఏర్పడే ఆదాయ నష్టాన్ని తదుపరి చార్జీల సవరణలో భర్తీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మూడు నెలల పాటు విమానయాన సంస్థలకు రూ.400 కోట్లు ఆదా అవుతాయని అంచనా.

ఇవి కూడా చదవండి..

ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..

ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..

Updated Date - Apr 09 , 2026 | 04:02 AM