జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్లో జీక్యూజీ పార్ట్నర్స్ 1.8 శాతం వాటా విక్రయం
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:24 AM
విమానాశ్రయాల నిర్వహణ సంస్థ జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ షేర్లలో భారీ డీల్ చోటు చేసుకుంది. అమెరికా కేంద్రంగా పనిచేసే...
డీల్ విలువ రూ.1,906 కోట్లు
న్యూఢిల్లీ: విమానాశ్రయాల నిర్వహణ సంస్థ జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ షేర్లలో భారీ డీల్ చోటు చేసుకుంది. అమెరికా కేంద్రంగా పనిచేసే ఇన్వె్స్టమెంట్ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్.. జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఈక్విటీలో తనకున్న వాటా నుంచి 1.85 శాతం వాటాను (19.5 కోట్ల షేర్లు) బుధవారం విక్రయించింది. ఫిడెలిటీ ఇంటర్నేషనల్ అనే మరో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థ ఈ షేర్లను రూ.1,906.12 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సంస్థ ఒక్కో షేరును సగటున రూ.97.75 చొప్పున కొనుగోలు చేసినట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి
శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం