Share News

బంగారం ధరలకు రెక్కలు.. రూ.1.73 లక్షలు దాటిన పది గ్రాముల పసిడి..

ABN , Publish Date - Mar 01 , 2026 | 11:40 AM

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. శనివారం నుంచి భారీ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. యుద్ధం కారణంగా పది గ్రాముల బంగారం ధర మళ్లీ రూ.2 లక్షలు దాటే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి.

బంగారం ధరలకు రెక్కలు.. రూ.1.73 లక్షలు దాటిన పది గ్రాముల పసిడి..
Gold Silver Price

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. శనివారం నుంచి భారీ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. యుద్ధం కారణంగా పది గ్రాముల బంగారం ధర మళ్లీ రూ.2 లక్షలు దాటే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో బంగారం ధర రూ.2 లక్షలకు, వెండి ధర రూ.4 లక్షలకు చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు (Gold prices).


ఈ రోజు (మార్చి 1న) ఉదయం 11:30 గంటల సమయంలో హైదారాబాద్ బులియన్ మార్కె‌ట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,73,080కు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.4,300కు పైగా పెరిగింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,650 దగ్గర ఉంది (live gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.4000 పెరిగింది.


ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,73,230కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,58,800కి చేరుకుంది. మరోవైపు వెండి ధర మళ్లీ మూడు లక్షల రూపాయల మార్క్‌ను దాటేసింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3.25 లక్షలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.95 లక్షలుగా ఉంది.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌పై దాడులు.. భారత్‌కు భారీ నష్టం తప్పదా..?


బంగారం, వెండిపై వార్ ఎఫెక్ట్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Mar 01 , 2026 | 11:40 AM